మత్స్యకారులకు సంబంధించిన సంఘటనలు తీవ్ర ఆందోళన.. ఆ రెండు దేశాలు సహకారతో..
Mon May 05, 2025 14:40 Politics
ఇటీవల బంగాళాఖాతంలో జరిగిన ఐదు వేర్వేరు సంఘటనలలో తమిళనాడు (Tamilnadu)కు చెందిన 24 మంది భారతీయ మత్స్యకారులకు సంబంధించిన (Fishermen Issues) సంఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని జనసేన అధినేత (Janasena Chief), ఏపీ డిప్యూటీ సీఎం (AP Deputy CM) పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా (Social Media) ట్విట్టర్ (Twitter) వేదికగా పోస్టు చేశారు. ‘‘నాగపట్నం జిల్లాకు చెందిన ఈ మత్స్యకారులు సముద్రంలో జరిగిన ఘర్షణల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారని, గాయపడ్డారని తెలుసుకోవడం బాధాకరం, భారతదేశం.. శ్రీలంక మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న స్నేహపూర్వక సంబంధాల దృష్ట్యా, పునరావృతమయ్యే ఈ సంఘటనలను గమనించి, ఈ పునరావృత పరిస్థితులను స్నేహపూర్వకంగా పరిష్కరించాలని విదేశాంగ మంత్రిత్వ శాఖను కోరుతున్నాను’’ అని పోస్టు చేశారు.
ఇది కూడా చదవండి: వరుస సమీక్షలతో సీఎం చంద్రబాబు బిజీ బిజీ! అధికారులకు కీలక ఆదేశాలు!
భారతదేశం, శ్రీలంక ప్రభుత్వాలు పరస్పర సహకార స్ఫూర్తితో ఈ సమస్యలను పరిష్కరించడానికి నిర్మాణాత్మక చర్చలు చేయడం అత్యవసరమని భావిస్తున్నట్లు డిప్యూటీ సీఎం అన్నారు. ఇరువైపులా మత్స్యకారుల భద్రత, గౌరవాన్ని నిలబెట్టడానికి నిరంతర ప్రయత్నాలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ‘‘కాగా రాజధాని అమరావతి ప్రపంచస్థాయి, సర్వశ్రేష్ఠ రాజధానిగా నిలుస్తుంది. కేవలం ఆర్కిటెక్చర్, కాంక్రీట్ జంగిల్లా కాకుండా... జవాబుదారీతనానికి, న్యాయానికి, ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలుస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధాని మోదీ కలిసి అమరావతిని ప్రపంచస్థాయి రాజధానిగా తీర్చిదిద్దుతారు. మన యువత ఉద్యోగాల కోసం బెంగళూరు, చెన్నై, హైదరాబాద్లాంటి నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా... అమరావతే అవకాశాల రాజధానిగా నిలుస్తుంది’’... అని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఉద్ఘాటించారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల త్యాగాలు, జగన్ హయాంలో వారు ఎదుర్కొన్న కష్టాలను ప్రస్తావిస్తూ ఉద్వేగంగా ప్రసంగించారు.
ఇది కూడా చదవండి: ఆ నామినేటెడ్ పదవుల భర్తీకి డేట్ ఫిక్స్! ఎప్పుడంటే!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
జగన్ కు కొత్త పేరు పెట్టిన కూటమి నేతలు! అంతా అదే హాట్ టాపిక్!
డ్వాక్రా మహిళలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త! ఇకపై ఇంటి నుంచే..
షాకింగ్ న్యూస్: జగన్ హెలికాప్టర్ ఘటన దర్యాప్తు వేగవంతం! 10 మంది వైసీపీ కార్యకర్తల అరెస్ట్!
నెల్లూరు రూరల్ అభివృద్ధి అద్భుతం.. 60 రోజుల్లోనే 339 అభివృద్ధి పనులు పూర్తి! మంత్రి ప్రశంసలు
పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో.. జాతీయ సాంస్కృతోత్సవ పురస్కార వేడుక!
ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!
అడ్డంగా బుక్కైన ప్రపంచ యాత్రికుడు అన్వేష్.. పోలీస్ కేసు నమోదు.. ఏం జరిగిందంటే?
జైలులో మాజీమంత్రి ఆరోగ్య పరిస్థితి విషమం! ఆసుపత్రికి తరలింపు..!
ఏపీ ప్రజలకు శుభవార్త! రూ.3,716 కోట్లతో.. ఆ రూట్లో ఆరు లైన్లుగా నేషనల్ హైవే!
సంచలన నిర్ణయం తీసుకున్న OYO హోటల్స్.. మరో కొత్త కాన్సెప్ట్తో - ఇక వారికి పండగే..
నిరుద్యోగులకు శుభవార్త.. నెలకు రూ.60 వేల జీతం.. దరఖాస్తుకు మే 13 చివరి తేదీ!
ఇక బతకలేను.. నా చావుకు కారణం వాళ్లే! ఢీ ఫేమ్ జాను కన్నీటి వీడియోతో కలకలం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #Pawankalyan #AndhraPradesh #APpolitics #APNews #Speech #Jagan #Anakapalli
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.